ప్రమాదం నుంచి కోలుకోగానే ‘వీరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయిధరమ్తేజ్. ఆ తర్వాత తన మావయ్య పవన్కల్యాణ్తో చేసిన ‘బ్రో’ మంచి సినిమాగా అభినందనలు అందుకుంది. ప్రస్తుతం సంపత్నంది దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ మొదలైంది.
విశేషమేంటంటే ఈ సినిమాకు ‘గంజాయి శంకర్’ అనే పేరు అనుకుంటున్నారంట. ఈ సినిమాలో సాయిధరమ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తున్నది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో సాయిధరమ్తేజ్ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో ఆవిష్కరించబోతున్నారట దర్శకుడు సంపత్నంది.