సెప్టెంబర్ 10న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇటీవల సాయి ధరమ్ తేజ్ కోలుకోగా, ఆయనకు ఫిజియో థెరపీ చేస్తూ వచ్చారు . ఇప్పుడు పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్.. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపైన ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారు. విడుదలకు సిద్ధంగా ఉన్న తన రిపబ్లిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి మాట్లాడేందుకు దర్శకుడు దేవా కట్టా ఇంటికి వెళ్తూండగా ప్రమాదం జరిగింది. నెల రోజులకు పైగా సాయి ధరమ్ తేజ్కి చికిత్స అందిస్తూ వచ్చారు. తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ఇటీవల విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.