Virupaksha Sequel | ప్రస్తుతం ఏ థియేటర్లో చూసిన విరూపాక్ష హంగామే. ఎన్నో ఏళ్ళ తర్వాత సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కమర్షియల్ సక్సెస్ సాధించాడు. రిలీజ్కు ముందు ఈ సినిమాపై అంతగా బజ్ లేదు. కానీ తొలిరోజు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. రోజు రోజుకు కలెక్షన్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. టిక్కెట్లు భారీగా తెగుతున్నాయి. ఇక తాజాగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫైనల్ రన్లో వంద కోట్ల బొమ్మయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక కార్తిక్ దండూ విజన్, టేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి సినిమాకే ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చాడంటే మాములు విషయం కాదు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందరిలోనూ విరూపాక్షకు సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న మెదులుతుంది. దానికి తగ్గట్లే కార్తిక్ దండూ ఎండ్ కార్డ్స్ పడే ముందు సాయిధరమ్ తేజ్ కళ్లను చూపిస్తూ చిన్న సెకండ్ పార్ట్పై హింట్ ఇచ్చినట్లు అనిపించింది. కాగా తాజాగా దీనిపై తేజ్ స్పందించాడు. సాయి తేజ్ ఫ్మాన్ ఒకతను మూవీ క్లైమాక్స్లో చిన్న హింట్ ఇచ్చారు. పార్ట్2 ఉంటుందా అన్న. ఒకవేళ పార్ట్2 ఉంటే మన ఫ్యాన్స్కు పండగే అన్న అంటూ అడిగాడు. దానికి సాయి తేజ్ స్పందించి ఉందనే కదా హింట్ ఇచ్చాం అని రిప్లై ఇచ్చాడు. దాంతో విరూపాక్షకు సీక్వెల్ ఉంటుందని తేజ్ స్పష్టం చేశాడు.