Sai Durga Tej | టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ మళ్లీ తన పేరు మార్చుకున్నాడు. తన పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు తాజాగా వెల్లడించాడు. ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇంతకుముందు కూడా సాయిధరమ్ తేజ్ తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. 2021లో హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి యాక్సిడెంట్ అయిన అనంతరం న్యూమరాలజీ ప్రకారం సాయితేజ్ అని పేరు మార్చుకున్నాడు. ఇక తాజాగా మళ్లీ మూడోసారి తన పేరును సాయిదుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు వెల్లడించారు.
సాయిదుర్గ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తున్నది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజాహెగ్డే కథానాయికగా నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో సాయిధరమ్తేజ్ను మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పంథాలో ఆవిష్కరించబోతున్నారట దర్శకుడు సంపత్నంది.