S.S.Thaman | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గుడుపుతున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్లు ఇలా ప్రతి ఒక్కటి సినిమాపైన రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. ఇక తాజాగా థమన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపాడు.
‘రాధేశ్యామ్’ చిత్రం’ బాహుబలి’ సినిమాకు తక్కువేం కాదు. బాహుబలి సినిమా ఒక పెద్ద సైజ్ యుద్దం లాంటింది. రాధేశ్యామ్ చిత్రం పెద్ద సైజ్ లవ్ స్టోరి అంటూ తెలిపాడు. ఈ చిత్రానికి థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇటీవలే సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి కూడా రాధాకృష్ణను రాధా కామెరూన్ అంటూ పొగడ్తలతో ముంచాడు. వీళ్ల మాటలతో సినిమా ఎప్పుడు చూద్దామా అంటూ అంటూ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళితో ప్రభాస్ జరిపిన ఇంటర్వూలో కూడా షిప్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ తనకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చిందని కితాబిచ్చాడు.గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.