రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. కతిరేసన్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ప్రియా భనానీ శంకర్ కథానాయికగా నటించింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ఠాగూర్’ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
మదర్సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రమిది. అమ్మ, నాన్నలతో ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుంది. యాక్షన్తో పాటు సెంటిమెంట్, కామెడీ అంశాలతో మెప్పిస్తుంది. అమ్మని ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఇష్టపడతారు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ఈ సినిమాలో నేను మధ్యతరగతి ఐటీ ఉద్యోగి పాత్రలో నటించాను. జీవితంలో అనుకోకుండా తలెత్తిన ఓ సమస్యను అతను ఎలా పరిష్కరించాడు? ఈ క్రమంలో ఎదురైన అవరోధాలు ఏమిటన్నదే సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించాం. యాక్షన్ ఎపిసోడ్స్ మరో స్థాయిలో ఉంటాయి. మాస్తో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా వందశాతం ఈ సినిమా చేరువవుతుంది. ‘ఠాగూర్’ మధుగారు నా లక్కీ ప్రొడ్యూసర్. నా మీద నమ్మకంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్కుమార్ అద్భుతమైన సంగీతాన్నందించాడు. మాస్తో పాటు మెలోడీ పాటలుంటాయి. సేవా కార్యక్రమాల్ని వదిలిపెట్టను సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి సేవా కార్యక్రమాలకు సమయం కేటాయిస్తుంటాను.
ఈ మధ్యే పిల్లలకు 150 వరకు ఆపరేషన్లు చేయించాను. ఆపరేషన్ థియేటర్ నుంచి వాళ్లు వచ్చేంతవరకు నేను టెన్షన్కు గురవుతాను. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సినిమాల్లో హీరోగా ఉండటం కంటే రియల్లైఫ్లో హీరోగా ఉండాలన్నదే నా ఆశయం. అది నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను. ప్రస్తుతం ‘చంద్రముఖి-2’ ‘జిగర్తాండ-2’ చిత్రాల్లో నటిస్తున్నా. లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నా.