RP Patnaik | తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ (RP Patnaik). నీకోసం సినిమాతో టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆర్పీ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు తన సంగీతాన్ని అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఆర్పీ మరో కొత్త ప్రయోగంతో ముందుకురాబోతున్నాడు. ‘భగవద్గీత’ ను నేటి యువతకు అందించడానికి ఆడియో రూపంలో తీసుకురానున్నట్లు ప్రకటించాడు.
ఇంతకుముందు ‘భగవద్గీత’ అంటే తెలుగువారికి మొదట గుర్తొచ్చే పేరు ఘంటసాల. పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన అంటూ భగవద్గీతపై ఘంటసాల పాడిన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి. అయితే ఇదే గీతను నేటి యువత కోసం కొత్తగా తీసుకురానున్నట్లు ఆర్పీ పట్నాయక్ (RP Patnaik) ప్రకటించాడు. ”నేటి యువతకు సరైన మార్గ నిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం మరియు జీవన మార్గం చూపించే శాస్త్రం భగవద్గీత కు మించి ఇంకెక్కడా దొరకదు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం నేను రికార్డ్ చేసాను. పూర్తి వివరాలతో తొందర్లో వస్తాను.” అంటూ ఆర్పీ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు.
నేటి యువతకు సరైన మార్గ నిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం మరియు జీవన మార్గం చూపించే శాస్త్రం భగవద్గీత కు మించి ఇంకెక్కడా దొరకదు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం నేను రికార్డ్ చేసాను. పూర్తి వివరాలతో తొందర్లో వస్తాను. pic.twitter.com/4hsWBxcMnw
— rp patnaik (@rppatnaik) February 10, 2024