శ్రీజిత్ వడ్డి, క్రిష కురుప్, అజయ్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘నీకై నేను’. ఈ చిత్రాన్ని ఎన్జీఎస్పీ క్రియేషన్స్ పతాకంపై నాగిరెడ్డి తారకప్రభు, ఏ హనీఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణకుమార్ అసూరి దర్శకుడు. భాస్కర్రాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఘాట్ రోడ్ నేపథ్యంతో సాగే క్రైమ్, లవ్ చిత్రమిదని, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు దర్శకుడు. నిర్మాత నాగిరెడ్డి తారకప్రభు మాట్లాడుతూ..‘మున్నార్లో ఈ నెల 15 తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.