Allu Arjun | ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా ప్రతి చోట అల్లుఅర్జున్ పేరు మార్మోగిపోతుంది. అవార్డు ఫంక్షన్ ఏదైనా సరే అందులో బన్నీ పేరు కచ్చితంగా వినబడుతుంది. కాగా గతేడాది వచ్చిన పుష్ప సినిమాతో అల్లుఅర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప రాజ్గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. సినీ ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు అల్లు అర్జున్తో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సర్కస్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సౌత్ స్టార్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు దక్షిణాది స్టార్లందరితో సినిమా తీయాలని ఉందని తెలిపాడు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, అజిత్, విజయ్, కార్తిలతో సినిమా తెరకెక్కించాలనుందని పేర్కొన్నాడు. ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వం వహించి సర్కస్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు.