Dilraju | టాలీవుడ్లోని అగ్ర నిర్మాతల్లో దిల్రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన దిల్రాజు.. ‘దిల్’ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రూపొందిస్తున్నాడు. అయితే ఈ మధ్య దిల్రాజు వివాదాల్లో ఎక్కువగా చిక్కుకుంటున్నాడు. ‘వారసుడు’ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక విషయంలో ట్రోల్కు గురవుతూనే ఉన్నాడు. మొన్నటికిమొన్న తమిళ్లో అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే దానిపై దిల్రాజు పూర్తి వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా దిల్రాజు తన కెరీర్లో లాభాలే కాదు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు కూడా ఉన్నాయని వెల్లడించాడు.
పవన్ కళ్యాణ్ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎదిగిన దిల్రాజు.. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాతో కోట్లలో నష్టపోయానని తెలిపాడు. ఇక అదే ఏడాది రిలీజైన ‘స్పైడర్’ కూడా డిస్ట్రిబ్యూషన్లో తనకు తీవ్రంగా నష్టాల్ని మిగిల్చిందని వెల్లడించాడు. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు తెచ్చిపెట్టిన నష్టాలతో ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారని, లేదంటే ఇండస్ట్రీని వదిలి వెల్లిపోయేవారని తెలిపాడు. కాగా అదే సంవత్సరం తాను నిర్మించిన 6 సినిమాలు విజయం సాధించడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని వెల్లడించాడు. అందుకే తాను డిస్ట్రిబ్యూషన్తో పాటు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని అన్నాడు.
ప్రస్తుతం దిల్రాజు నిర్మాణంలో రూపొందిన ‘వారసుడు’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీనితో పాటుగా శంకర్-రామ్చరణ్ ప్రాజెక్ట్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60శాతం పూర్తయింది.