అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా రామరాజు దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్నిచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణను సింగిల్షెడ్యూల్లో పూర్తిచేస్తామని, రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా వుంటుందని దర్శకుడు తెలిపారు.