ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ప్రధానాంశం ఏపీలో టికెట్ ధరలు. ఈ అంశంపై నాని వంటి హీరోలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం తన మొండిపట్టు వీడలేదు. దీంతో ఈ విషయంపై టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు, తనకు కనిపించిన ప్రతి అంశంపైనా తనదైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ).. ఏపీ టికెట్ ధరలపై కొన్ని ప్రశ్నలు వేశారు.
ఇటీవల ఏ ఛానెల్కు వెళ్లినా ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆర్జీవీ.. ట్విట్టర్ వేదికగా నేరుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని గారూ..’’ అంటూ ఆయన ప్రశ్నలు వేశారు. వీటికి మంత్రి కానీ, ఆయన ప్రతినిధులుకానీ సమాధానం ఇవ్వాలని కోరారు.
అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ వ్యాఖ్యలు వాస్తవమేనని కొందరు ట్వీట్లు చేస్తుండగా.. మరికొందరు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అక్కడితో ఆగని ఆర్జీవీ.. తన సినీ మిత్రులపై కూడా సెటైర్లు వేశారు. ‘‘టికెట్ ధరల సమస్యపై తమ మనసులో ఉన్న మాటలను ఫిలిం ఇండస్ట్రీలో నా కొలీగ్స్ అందరూ మాట్లాడాలని నా ప్రార్థన కాదు, డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పుడూ తెరవలేరు. తర్వాత మీ ఖర్మ’’ అంటూ ముగించాడు.