తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది హీరోలకు, నటీనటులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 95 శాతం కోలుకున్నారు కూడా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు. ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. నిజానికి వకీల్ సాబ్ సినిమాకు పనిచేసిన చాలామందికి కరోనా సోకింది. హీరోయిన్ నివేద థామస్, నిర్మాత దిల్ రాజు సహా చాలా మందికి వైరస్ సోకడంతో క్వారంటైన్ కి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే దీనిపై వర్మ తన స్టైల్ లో ఓ సెటైరికల్ పోస్టు పెట్టాడు.
అది చూసిన తర్వాత అభిమానులకు మండిపోతుంది. అసలే పవన్ కళ్యాణ్ కు వైరస్ సోకిందని కంగారు పడుతున్న వేళ.. వర్మ చేస్తున్న వెటకారం చూసి సోషల్ మీడియాలో ఆయనపై ఫైర్ అవుతున్నారు. వాళ్లను అంతగా డిస్టబ్ చేసేలా వర్మ ఏం చేసాడు అనుకుంటున్నారా.. ఏం లేదు సింపుల్.. పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటో పోస్ట్ చేసి.. దానికింద ఒక లైన్ రాశాడు.
పవన్ కళ్యాణ్ అభిమానులు.. వెంటనే ఆ వైరస్ లను పచ్చడి పచ్చడి చేసి చంపేయండి అంటూ ట్వీట్ చేసాడు. ఇది చూసిన పీకే ఫ్యాన్స్ నిజంగానే రెచ్చిపోతున్నారు. వర్మ గారు మీరు కాసేపు కూడా కామ్ గా ఉండలేరా.. ఎందుకు సార్ కావాలని రెచ్చగొడుతున్నారు అంటూ ఆయనకు కొందరు మర్యాదగా కామెంట్స్ పెడుతుంటే.. మరికొందరు మాత్రం కాస్త నాటుగానే సమాధానం ఇస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కు కాస్త దూరంగా ఉన్న వర్మ ఇప్పుడు ఈ పోస్ట్ తో దగ్గర అయిపోయాడు.