సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్తేజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘నటరత్నాలు’. ఇనయ సుల్తాన నాయిక. నర్రా శివనాగు దర్శకుడు. డా॥ దివ్య నిర్మాత. పాటలు మినహా షూటింగ్ను పూర్తిచేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ, క్రైమ్ నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. త్వరలోనే పాటలను పూర్తిచేసి అక్టోబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. అర్చన, శృతిలయ, సుమన్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: నాగమధు.