సాయి తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు.
తాజాగా రిపబ్లిక్ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని వీక్షించారు. రిపబ్లిక్ చూసాను… సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగొచ్చింది. అది మరింత స్ట్రాంగ్ గా ‘రిపబ్లిక్’ రూపంలో తిరిగి వస్తోంది. ఈ సినిమాతో దేవాకట్టా తిరిగి ఇంతకు మునుపు ఫామ్ లోకి వచ్చాడు. టీం కు అభినందనలు” అంటూ నాని ట్వీట్ చేశారు. ఈ సినిమా సాయి తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.“రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్గా నటిస్తున్నాడు.