Renu Desai | తెలుగు సినీ పరిశ్రమలో రేణూ దేశాయ్కు ఒక ప్రత్యేక స్థానముంది. మోడల్గా కెరీర్ ప్రారంభించి, కేవలం 19 ఏళ్ల వయసులో ‘బద్రి’ (2000) సినిమా ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ద్వారా ఎంతో గుర్తింపు పొందినప్పటికీ, కొద్ది సినిమాల తర్వాత నటనకు స్వస్థి చెప్పారు. తన మొదటి చిత్రం హీరో పవన్ కళ్యాణ్తో సహజీవనం కొనసాగించి, తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని అనుకోని కారణాల వలన విడిపోయారు. పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించగా వారి పేర్లు అకీరా నందన్ మరియు ఆధ్యా. విడాకుల తర్వాత రేణూ తన పిల్లల పెంపకంపై పూర్తిగా దృష్టి పెట్టారు.ఒక దశలో రెండో వివాహం చేసుకోవాలనే ఆలోచన చేసిన దానిని విరమించుకుంది.
సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చినా, రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనేక విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.. ఫోటోలు, థాట్స్, తన పిల్లల గురించి అప్డేట్స్ ఇస్తూ ఫాలోవర్స్తో దగ్గరగా ఉంటారు. ఓ దశలో పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర ట్రోలింగ్ ఎదురవడంతో, కామెంట్ సెక్షన్నే ఆఫ్ చేశారు. కానీ తాజాగా మళ్లీ అలాంటి ఆంక్షలు తొలగించి, పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో మమేకమవుతున్నారు. తన 21 ఏళ్ల వయసులో తీసుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది రేణూ . “ఛీటింగ్ చేయకుండా మీ 21 ఏళ్ల వయసులో తీసుకున్న ఫోటో షేర్ చేయండి” అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుండగా, “అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలానే ఉన్నారు” అంటూ మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.
2023లో రేణూ దేశాయ్ తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కీలక పాత్ర పోషించినా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలని అందుకోలేక ఫెయిల్ అయ్యింది. అప్పట్లో ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్సిరీస్ ప్రారంభించినప్పటికీ, దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. రేణూ దేశాయ్ సామాజిక సేవపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ స్థాపించి, తన వంతుగా ప్రజలకు సహాయం చేయడంలో భాగస్వామ్యమవుతున్నారు.