తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ జి.జి.కృష్ణారావు (87) మంగళవారం బెంగళూరులో కన్నుమూశారు. తెలుగులో కళాతపస్వి కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకుల చిత్రాలకు ఆయన ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ప్రోత్సాహంతో ఎడిటర్గా తెలుగు పరిశ్రమలోని ప్రవేశించారు. ‘పాడవోయి భారతీయుడా’ చిత్రంతో ఎడిటర్గా కెరీర్ ఆరంభించిన ఆయన పలు భాషల్లో దాదాపు 200 చిత్రాలకు పనిచేశారు. కె.విశ్వనాథ్ రూపొందించిన శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభలేఖ, శృతిలయలు, సిరివెన్నెల, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్గా సేవలందించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు. సప్తపది, సాగరసంగమం, శుభ సంకల్పం చిత్రాలకుగాను ఉత్తమ ఎడిటర్గా నంది అవార్డులు అందుకున్నారు.