Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ముంబయి కోర్టు ఊరటనిచ్చింది. హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరెతో స్టేజ్పైనే ముద్దుల వ్యవహారంలో శిల్పాశెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ముంబయి కోర్టు స్పష్టం చేసింది. ముద్దుపెట్టింది రిచర్డ్ గెరె అని.. నటి కాదంటూ కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో 2007, ఏప్రిల్ 7న ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శిల్పాశెట్టితో పాటు రిచర్డ్ గెరె హాజరయ్యారు. స్టేజీపైనే గెరె శిల్పాశెట్టిని గట్టిగా హత్తుకొని ముద్దులు పెట్టాడు. దాంతో కార్యక్రమానికి హాజరైన వారంతా షాక్కు గురయ్యారు.
ఆ తర్వాత శిల్పాశెట్టి, రిచర్డ్ గెరె వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, శెల్పాశెట్టికి ముద్దు పెట్టడంపై రిచర్డ్.. ‘ముద్దుతో ఎయిడ్స్ వ్యాపించదన్న సందేశాన్ని ఇచ్చేందుకు స్టేజ్పై తాను అలా చేశానంటూ’ వివరణ ఇచ్చారు. ఇద్దరి ప్రవర్తన అసభ్యకరంగా ఉందటూ రాజస్థాన్తో పాటు ముంబయిలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ కేసు విచారణ జరగ్గా.. శిల్పాశెట్టిపై ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. అయితే, పబ్లిసిటీ కోసమే తనపై కేసు పెట్టారంటూ శిల్పా ఆరోపించింది. ఈ కేసులో పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారన్న కోర్టు.. బహిరంగంగా ముద్దుపెట్టుకోవడం నేరమన్న పోలీసుల వాదనతోనూ సెషన్స్ కోర్టు ఏకీభవించలేదు. దాదాపు 16 సంవత్సరాల కిందట జరిగిన కేసు వ్యవహారంలో ఎట్టకేలకు ఊరట లభించినట్లయ్యింది.