బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా తెలుగు తెరకు వస్తుందన్న వార్తలు ఇటీవల వినిపించాయి. టాలీవుడ్ పాన్ ఇండియా ఇమేజ్తో బాలీవుడ్ నాయికలు ఇక్కడికి వరుస కడుతున్న నేపథ్యంలో సోనాక్షి రాక ఆశ్చర్యాన్ని కలిగించదు. ఆమె బాలకృష్ణ-అనిల్ రావిపూడి కొత్త సినిమాలో నాయికగా ఎంపికైందనే వార్తలు వినిపించగా..ఇప్పుడు వాటిలో నిజం లేదంటూ సోనాక్షి స్వయంగా వెల్లడించింది. ఇన్స్టా ద్వారా ఈ హీరోయిన్ స్పందిస్తూ…‘నేనొక తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటిదాకా నన్నెవరూ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సంప్రదించలేదు. తెలుగులో మంచి అవకాశం వస్తే వదులుకోను.’ అని తెలిపింది.