అభిమానుల, బంధు మిత్రుల అశ్రునయనాల మధ్య రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్హౌస్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
తమ అభిమాన నటుడిని చివరిసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, సినీ తారలు తరలివచ్చారు. అంత్యక్రియలకు అనుమతించే పాస్లను ఉన్నవారినే పోలీసులు ఫామ్హౌస్లోకి వెళ్లనిచ్చారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ చేశారు. అంతకముందు జుబ్లీ హిల్స్ నివాసంలో కృష్ణంరాజు పార్థివ దేహానికి జయప్రద, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, హీరో సుధీర్ బాబు, మంచు మనోజ్ తదితరులు నివాళులు అర్పించారు.