రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇన్నేళ్లు బిజీగా ఉన్న రామ్ చరణ్ రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు.ఇక ఇప్పుడు దర్శక దగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా కోసం పని చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి,దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర బృందం అంతా కలిసి ఫొటోలు దిగగా ఆ పిక్స్ వైరల్గా మారాయి. మరి కొద్ది రోజులలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.
అంతకముందు సినిమా టీం పోస్టర్ విడుదల చేయగా, అందులో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్లతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లో సినిమాలో నటించే నటీనటులతోపాటు దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కనిపించారు. ఈ చిత్రం రామ్ చరణ్కి 15వ మూవీ కాగా, ఇందులో చరణ్కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. ఇది దిల్ రాజు బ్యానర్కు 50 సినిమా కావడం విశేషం. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది.