రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేష్వర్మ దర్శకుడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. మీనాక్షిచౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం. కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం’ అనే గీతాన్ని వినాయకచవితి సందర్భంగా శుక్రవారం విడుదలచేశారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని హరిప్రియ ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. ప్రియుడిపై ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ అందంగా సాగిన ఈ గీతంలో రవితేజ, డింపుల్ హయతి చక్కటి కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. యశ్ మాస్టర్ నృత్యాల్ని అందించారు. నిర్మాత మాట్లాడుతూ ‘డబ్బుతో పాటు అనుబంధాలు ముఖ్యమని నమ్మే ఇద్దరు యువకుల కథ ఇది. వారిలో ఎవరి సిద్ధాంతం గెలిచిందన్నది ఆకట్టుకుంటుంది. రవితేజ పాత్ర భిన్న పార్శాల్లో ఉంటుంది. కథలోని మలుపులు థ్రిల్కు గురిచేస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జీకే విష్ణు, సుజిత్ వాసుదేవ్.