సినిమాల వేగాన్ని పెంచుతున్నారు రవితేజ. మూడు సినిమాలు సెట్స్పై ఉండగానే తాజాగా మరో చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారాయన. సుధీర్వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్వర్క్స్ పతాకాలపై అభిషేక్నామా నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను విడుదలచేశారు. ‘హీరోలు ఉండరు’ అనే క్యాప్షన్, పురాతన శిల్పాలతో ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘రవితేజ హీరోగా నటిస్తున్న 70వ చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సరికొత్త కాన్సెప్ట్తో రూపొందిస్తున్నాం. ఈ నెల 5న టైటిల్, ఫస్ట్లుక్ విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ: శ్రీకాంత్ విస్సా.