హీరో రవితేజ నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలుగా నటిస్తున్నారు. శరత్ మండవ దర్శకుడు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ..‘యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సినిమా ఆకట్టుకుంటుంది. రవితేజ సినిమా నుంచి కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి’ అన్నారు.