RT4GM | కొన్ని కాంబినేషన్లు సిల్వర్ స్క్రీన్పైకి వస్తున్నాయంటే ఆ సినిమాల క్రేజ్ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ రికార్డుల గురించే అంతా చర్చ నడుస్తుంది. అలాంటి క్రేజీ కాంబినేషనే రవితేజ (Ravi Teja)-గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఈ ఇద్దరూ ఇప్పటికే డాన్ శీను, బలుపుతోపాటు క్రాక్ లాంటి సూపర్ సక్సెస్లను అందుకున్నారని తెలిసిందే. చాలా కాలంగా సూపర్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజాకు క్రాక్ సినిమాతో అదిరిపోయే సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు గోపీచంద్ మలినేని.
ఈ ఇద్దరు మరో సినిమా చేయబోతున్నారని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ బయటకు వచ్చింది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో సినిమా వస్తోంది. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ RT4GM (వర్కింగ్ టైటిల్) సినిమాను తెరకెక్కించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యేర్నేని, రవిశంకర్, రవితేజ, గోపీచంద్ మలినేని.. కంప్లీట్ బ్లాక్ అవుట్ఫిట్లో మెరిసిపోతున్న స్టిల్తో రిలీజ్ చేసిన RT4GM అధికారిక ప్రకటన ఇప్పుడు మూవీ లవర్స్లో జోష్ నింపుతోంది.
క్రాక్ తర్వాత మైత్రీమూవీ మేకర్స్, రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. మరో మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు అభిమానులు. క్రాక్ రవితేజ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలవడమే కాకుండా మాస్ మహారాజా మార్కెట్ను అమాంతం పెంచేసింది. మరి తాజా ప్రాజెక్ట్ రవితేజ స్టార్డమ్ను ఏ రేంజ్కు పెంచుతుందో చూడాలి. ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ అంచనాలు అందుకోలేకపోయింది.
The BLOCKBUSTER COMBO of MASS MAHARAJA @RaviTeja_offl & @megopichand join hands with BLOCKBUSTER PRODUCERS #NaveenYerneni & #RaviShankar of @MythriOfficial for #RT4GM ❤️🔥
This will be a MASS FEAST for the audience. Stay tuned for more updates 💥#RT4GMBlast 💥 pic.twitter.com/GUuyfBGzgC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2023