Rathnam | తమిళ నటుడు హీరో విశాల్ చాలా రోజులు తర్వాత ‘రత్నం’(Rathnam) అంటూ ఊరమాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా రీసెంట్గా ట్రైలర్ విడుదల చేయగా.. యూట్యూబ్లో రికార్డ్స్ దూసుకుపోతుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 19న తెలుగులో భారీ ఎత్తున్న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం హైదరాబాద్లోని నరసింహ రెడ్డి కాలేజీని వేదికగా ఎంచుకున్నారు. అయితే తాజాగా ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు విశాల్ ప్రకటించారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. అనుకోకుండా ‘రత్నం’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఈ విషయంపై ముందుగా క్షమాపణలు చెబుతున్న. మీ అందరిని కలిసి మీతో గడిపే అద్భుతమైన సమయం కోల్పోయినందుకు నేను చింతిస్తున్నాను. నేను దీన్ని భర్తీ చేస్తానని.. అలాగే ఈ ఈవెంట్ను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తానని మాటిస్తున్నాను. అంటూ విశాల్ రాసుకోచ్చాడు.
#Rathnam #PreReleaseEvent #Hyderabad pic.twitter.com/OR21Ru18C6
— Vishal (@VishalKOfficial) April 19, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానుంది. సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.