గీతగోవిందం, డియర్ కామ్రెడ్తో హిట్ఫెయిర్ గా నిలిచారు విజయ్దేవర కొండ-రష్మిక మందన్నా. ఈ ఇద్దరు స్టార్లు బాంద్రాలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న ఫొటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బ్లూ టీషర్ట్, షార్ట్స్లో విజయ్, పింక్ హుడీ డ్రెస్ విత్ క్యాప్తో ఉన్న రష్మికను అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్మనిపించాయి.
రష్మిక తన చేతిలో తెలుపు రంగు పూల బొకే పట్టుకోవడం చూడొచ్చు. ఈ ఇద్దరు యాక్టర్లు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న లైగర్ చిత్రంతో విజయ్ బిజీగా ఉండగా..రష్మిక మందన్నా బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను చిత్రంలో నటిస్తోంది.