విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వందకోట్లకుపైగా వసూళ్లను సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో చక్కటి ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది.
ఈ సినిమా విడుదలై మంగళవారంతో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో కథానాయిక రష్మిక మందన్నతో పాటు చిత్ర దర్శకుడు పరశురామ్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.