ఛలో, గీతా గోవిందం చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయిన రష్మిక ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడికి వరుసగా హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను
లో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ గుడ్ బాయ్
లోనూ కీలక పాత్రను పోషిస్తోంది. మరో రెండు హిందీ చిత్రాలకు సంతకాలు చేసింది.
ఫ్యూచర్ కెరీర్ని దృష్టిలో పెట్టుకున్నరష్మిక ఇటీవల ముంబైలో అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. రీసెంట్గా తన సొంత అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయింది. ఈ విషయాన్ని ఇన్స్టా ద్వారా తెలియజేస్తూ.. ఎట్టకేలకు ఈ రోజు నా అపార్ట్ మెంట్ లోకి మారిపోయాను! చాలా వస్తువులను షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఖచ్చు అంతం కానిది. అవసరమైన కొనుగోలులో నా అసిస్టెంట్ సాయి సహాయపడింది. ఆరా(పప్పీ) నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం..“ అని తెలిపింది.