తెలుగు చిత్రసీమలో ఇప్పుడు రష్మిక మందన్న టైం నడుస్తున్నది. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న చందంగా భారీ సినిమా అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. వరుసగా కొత్త సినిమాల్ని అంగీకరిస్తూ అభిమానుల్ని ఖుషీ చేస్తున్నదీ భామ. రష్మిక మందన్న తెలుగులో మరో బంపరాఫర్ను సొంతం చేసుకుంది. దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్రాజు తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.