రష్మిక ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుందికానీ.. నిజానికి తను చాలా సీరియస్. స్పందిచాల్సి వచ్చినప్పుడు ఘాటుగా స్పందించడం రష్మిక స్టయిల్. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో తాను నటించిన ‘యానిమల్’ సినిమా ఏ స్థాయి హిట్టో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఈ సినిమాపై వచ్చినంత ట్రోల్స్ కూడా ఈ మధ్య ఏ సినిమాకూ రాలేదు. కొందరైతే బహిరంగ విమర్శలకే దిగారు. ఈ క్రమంలోనే రష్మికపై కూడా పలు విమర్శలొచ్చాయి.
ముఖ్యంగా రణ్బీర్కపూర్తో తను నటించిన కార్వా చౌత్ సన్నివేశం బాగా ట్రోల్కి గురైంది. ఆ సీన్లో రష్మిక నటన అసంపూర్ణంగా ఉందనీ, డైలాగ్ కూడా అర్థంకాలేదని పలువురు ట్రోల్ చేశారు. కానీ రష్మిక మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే.. ‘యానిమల్’ విడుదలైన నాలుగు నెలల తర్వాత తాజాగా ఆ ట్రోల్స్పై రష్మిక మౌనం వీడింది. నేహా దూపియా షోలో ఈ ట్రోల్స్కి సరైన సమాధానం ఇచ్చింది నేషనల్ క్రష్.
‘మహిళల శరీరపై ట్రోల్ చేసేవాళ్లంటే నాకు అసహ్యం. ‘యానిమల్’ సినిమా విషయంలో నా ముఖంపై, నా నటనపై, నా డైలాగ్ డెలివరీపై చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. అందులో కార్వా చౌత్ సీన్ సినిమాకే హైలైట్. తొమ్మిది నిమిషాల నిడివి గల ఆ సన్నివేశాన్ని కేరక్టర్లోకి వెళ్లిపోయి ఏకబిగిన నటించాను. ఆ ఎమోషన్నుండి బయటి రావడానికి చాలా టైమ్ పట్టింది.
ఆ సీన్ చేశాక, లొకేషన్లో అందరూ క్లాప్స్ కొట్టారు. అభినందనలతో ముంచెత్తారు. థియేటర్లో కూడా అదే అప్లాజ్. చిత్రమేంటంటే.. కొందరు ఆ సీన్ పైనే ట్రోల్స్ చేశారు. దానికి నేనేం బాధ పడలేదు. అందరికీ అన్ని నచ్చాలని లేదు. ఎవరి అభిరుచి వాళ్లది. కానీ ఆ సీన్ చేయడానికి నేను పడ్డ కష్టం వారికి ఏం తెలుస్తుంది. అంత పెద్ద సన్నివేశంలో ఒక డైలాగ్ దగ్గర నా ఎక్స్ప్రెషన్ బాలేదని విమర్శించారు. నా పనితీరు ఎలా ఉందో నాకు తెలుసు. సో.. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు.’ అంటూ ఘాటుగా స్పందించింది రష్మిక.