Rashmika Mandanna | ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఈ సినిమా ఇచ్చిన జోష్తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అయితే వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది. రష్మిక ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించింది. అయితే రష్మిక ప్రయాణిస్తున్న విమానంలో సాకేంతిక సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో రష్మిక ఎంతో కంగారు పడింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక రష్మికతో పాటు టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా విమానంలో ఉన్నారు.
అయితే ఈ ఘటన అనంతరం ఇదే విషయాన్ని రష్మిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. ఈరోజు మేము చావు నుంచి తప్పించుకున్నాము’ అంటూ శ్రద్ధాకపూర్తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. దీంతో రష్మిక పోస్ట్ వైరల్ అయింది.