Actress Rashmika Mandanna | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోరు చూపిస్తుంది రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ రూ.80లక్షలు మోసపోయిందట. రష్మిక దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ ఆమెను దారుణంగా మోసం చేశాడని గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. రష్మిక నుంచి ఆ మేనేజర్ సుమారు రూ. 80 లక్షలు దొంగలించాడని తెలుస్తుంది. దీంతో రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలిగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై రష్మిక బయటకు చెప్పకుండా మౌనంగానే ఉంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే తన నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
రష్మిక ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా గడుపుతుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లీ పాత్ర పోషిస్తుంది. తొలిపార్టుతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ సెకండ్ పార్ట్లోనూ అదరగొడుతుందని ఇన్సైడ్ టాక్. దీనితో పాటుగా యానిమల్ సినిమా చేస్తుంది. రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే విడుదలైన ప్రీ-టీజర్కు తిరుగులేని హైప్ వచ్చింది. వీటితో పాటుగా రేయిన్బో అనే లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది.