చూడముచ్చటైన రూపం, కాస్తంత అమాయకత్వం కలబోతగా యువతరాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది పంజాబీ సోయగం రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో గోపీచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నది. మారుతి దర్శకుడు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. షూటింగ్ తుదిదశలో ఉంది. గురువారం రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఈ సుందరి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా చక్కటి సౌందర్యంతో కనిపిస్తున్నది. సినిమాలో ఆమె పాత్ర అందం, అభినయం మేలికలయికగా అలరిస్తుందని చిత్రబృందం చెప్పింది. ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయబోతున్నారు. సత్యరాజ్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కరమ్ చావ్ల, సంగీతం: జకేస్ బీజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్, నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, సమర్పణ: అల్లు అరవింద్.