బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో దీపికా- రణ్వీర్ సింగ్ తప్పక ఉంటారు.దీపికా-రణ్ వీర్ లు ముందు సినిమాల్లో సూపర్ పెయిర్ గా క్లిక్ అయ్యారు. ఆ తర్వాత అదే ప్రేమకు దారి తీసింది. అందుకే పెళ్లి చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జోడిని అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడతారు. రామ్ లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపిన హీరో రణ్ వీర్ సింగ్.
నిజమైన బంధం ఎప్పుడు నిలపడుతుంది అంటే వారు కుటుంబాలకు, బంధాలకు, అనుబంధాలకు విలువ ఇచ్చినప్పుడే అని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో వీరిద్దరూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వీరిద్దరూ మేడ్ ఫర్ ఈజ్ అదర్ అని చెబుతుంటారు. అయితే ప్రస్తుతం రణ్ వీర్ సింగ్. ‘‘ బిగ్ పిక్చర్’’ అనే రియాలిటీ షోకు ఆయన హోస్ట్గా వ్యవహరించనున్నారు. కలర్స్ ఛానల్లో ఆ షో ప్రసారం కానుంది
కలర్స్ టీవీలో ‘‘ బిగ్ పిక్చర్ ’’ ప్రోమో తాజాగా విడుదలైంది. తన పెళ్లి గురించి, భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల గురించి చర్చిస్తూ ఆ ప్రోమోలో కనిపించారు రణ్వీర్. వీడియోలో ఒక కంటెస్టెంట్తో రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ నాకు పెళ్లి అయిందని మీ అందరికీ తెలుసు. రెండు, మూడు సంవత్సరాల్లో పిల్లలు కూడా పుడతారు. మీ వదిన చాలా మంచిది. మాకు పుట్టబోయే బేబీ ఫొటోలను ప్రతిరోజు నేను చూస్తున్నాను. ఒక బేబీని ఇవ్వమని మీ వదినకు చెప్పు. అప్పుడు నా జీవితం అద్భుతంగా ఉంటుంది ’’ అని చెప్పారు