రంజిత్, సౌమ్యమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ‘మెరుపై మెరిసావే..వరమై కలిసావే..’ అంటూ చక్కటి ప్రేమ భావాలతో సాగిందీ గీతం.
సిధ్శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు ఘంటాడి కృష్ణ స్వరాల్ని సమకూర్చారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్రెడ్డి, సంగీతం: ఘంటాడి కృష్ణ, నిర్మాణ సంస్థ: ఎస్.ఎల్.ఎస్.మూవీస్, సమర్పణ: బెక్కెం వేణుగోపాల్.