చైతన్యవంశీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రేంజ్’. హేమంత్ దర్శకుడు. జెమిని ప్రొడక్షన్స్ సమర్పణలో గుడాల నవీన్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి జెమిని సీఈవో పీవీఆర్ మూర్తి క్లాప్నిచ్చారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. బలవంతుడైన శత్రువును తన తెలివితేటలతో ఢీకొట్టే ఓ యువకుడి కథ ఇది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం’ అని తెలిపారు.