రణబీర్ కపూర్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘షంషేరా’. వాణీకపూర్ నాయికగా నటిస్తున్నది. సంజయ్దత్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. యష్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకుడు. ఈ నెల 22న ఈ సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగులోనూ విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా విశేషాలు తెలిపారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో నటించాను. బల్లి, షంషేరా అనే పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాను. నా కెరీర్లో ఇదొక భిన్నమైన సినిమా. ఇలాంటి కథలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో సామాజిక విలువల కోసం, ప్రజల తరపున పోరాడే యోధుడిగా కనిపిస్తాను. మా సినిమాను 140 రోజులు చిత్రీకరిస్తే అందులో యాక్షన్ సీన్స్కే దాదాపు రెండు నెలలు పట్టింది. ఈ చిత్రంలో సంజయ్ దత్తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. తల్లీ కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.