ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో భీమ్లా నాయక్ చిత్రం ఒకటి. ఈ మూవీని మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రంగా రూపొందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు.
పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇటీవలే భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్కి పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు.
అయితే ఈ చిత్రం మల్టీ స్టారర్ కాగా, ఇంత వరకు రానాకి సంబంధించి ఏ అప్డేట్ ఇవ్వడం లేదని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఒక అప్డేట్ ని ఇస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. రానా చేస్తున్న డానియల్ శేఖర్ రోల్కి సంబంధించింది అయి ఉంటుందనే అందరు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా , సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.