Rana Daggubati | టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథనాయికగా నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో దాదాపు 6 ఏండ్ల తర్వాత మరో సినిమా వస్తుంది. ‘రాక్షస రాజా’ అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ప్రీ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ తాజాగా షూటింగ్ ప్రారంభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను రానా సోషల్ మీడియా వేదికాగా విడుదల చేశాడు. ఇక ఈ పోస్టర్లో రానా శివుడి అడ్డ నామాలు పెట్టుకుని గన్ పట్టుకుని చూస్తున్నట్లు ఉంది.
ఇక ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ ఏడాది రానా నాయుడు వెబ్ సిరీస్తో పాటు.. నిఖిల్ నటించిన స్పైలో అతిథి పాత్రలో మెరిశాడు రానా. ఈ యాక్టర్ నుంచి మరోవైపు రానానాయుడు వెబ్ ప్రాజెక్టు సెకండ్ ఇన్స్టాల్ మెంట్ అప్డేట్ కూడా రావాల్సి ఉంది.
#RakshasaRaja Begins 🔥🔥 pic.twitter.com/CeabZPCejE
— Rana Daggubati (@RanaDaggubati) December 14, 2023