ARKA Mediaworks | కమర్షియల్ సినిమాలతో పాటు పిరియాడిక్, పౌరాణిక చిత్రాల్లో కూడా ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. బాహుబలి, ‘రుద్రమదేవి’ చిత్రాలలో అరుదైన పాత్రల్లో అలరించిన రానా.. ఇప్పుడు ‘హిరణ్యకశ్యప’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమర చిత్ర కథల ఆధారంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రచనలో ఈ చిత్రం రూపొందనుంది.
ఇదీలావుంటే బాహుబలి టీంతో రానా మరో చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి నిర్మాతలు శోబు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని నిర్మాణంలో రానా ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. కొత్త దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.