RC 15 | మెగాపవర్స్టార్ రామ్చరణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ట్రిపుల్ ఆర్,ఆచార్య విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC15 షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు అత్యంత భారీగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులకు జీ స్టూడియోస్ భారీ ధరకు డీల్ కుదిరించుకుందని సమాచారం. ఈ చిత్రానికి అన్ని భాషల హక్కులకు కలుపుకొని 350 కోట్ల వరకు డీల్ కుదిరిందని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథ అందించగా ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.