అగ్ర కథానాయకుడు రామ్చరణ్ మరో భారీ చిత్రానికి పచ్చజెండా ఊపారు. గౌతమ్ తిన్ననూరి (మళ్లీరావా, జెర్సీ ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, యస్.వి.ఆర్ సినిమా పతాకాలపై వంశీ, ప్రమోద్, విక్రమ్, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. శనివారం ఈ సినిమా తాలూకు ప్రకటన వెలువడింది. ‘అత్యున్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించబోతున్నాం. ఓ విభిన్నమైన కథ కుదిరింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుత రామ్చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో నటించనున్న పాన్ఇండియా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.