హైదరాబాద్: పాపులర్ సీరియల్ రామాయణం మళ్లీ ఈ ఏడాది కూడా టీవీల్లో ప్రసారం కానున్నది. రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ 1987-88 సంవత్సరాల్లో దూర్దర్శన్లో ప్రసారం అయ్యింది. ఆ సీరియల్ను గత ఏడాది లాక్డౌన్ సందర్భంగా మళ్లీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా ఆ ఫేమస్ సీరియల్ ప్రసారం చేయనున్నట్లు దీపికా చిక్లియా పేర్కొన్నది. రామాయణం సీరియల్ సీత పాత్ర పోషించిన దీపిక తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాన్ని చెప్పింది. గత ఏడాది లాక్డౌన్ వేళ సీరియల్ ప్రసారం అయ్యిందని, చరిత్ర మళ్లీ పునరావృత్తం అవుతున్నట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు. అరున్ గోవిల్ ఆ సీరియల్లో రాముడి పాత్రను పోషించారు. ఈ ఏడాది స్టార్ భారత్ టీవీలో రామాయణం సీరియల్ ప్రసారం కానున్నది. రాత్రి ఏడు గంటలకు ఆ సీరియల్ లైవ్ అవుతుంది.