Rama jogaiah Sastry | ప్రముఖ తెలుగు లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. తాను మాట్లాడిన మాటలకు విపరీతార్థాలు తీయవద్దు అంటూ నెటిజన్లను కోరాడు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా ఫస్ట్ రోజు పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొదటిరోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా సాధించిన విజయం పట్ల చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో కళ్యాణ్ రామ్తో పాటు కొరటాల శివ, దిల్ రాజు, రామ జోగయ్య శాస్త్రి తదితరులు హాజరయ్యారు.
అయితే ఈ వేడుకలో రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే, విజయం ఇలా ఉంటుంది అంటూ ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు కొరటాల శివ అన్న మాటలు తనకు బాగా నచ్చుతాయని దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని ఈ దేవర ద్వారా నిరూపితమైంది’ అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. అయితే దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ఇది మెగా హీరోలను ఉద్దేశించే ఇలా అన్నాడని.. ఆచార్య సినిమాలో మెగా హీరోలు వేలు పెట్టకుంటే మూవీ ఇంకోలా ఉండేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు వివాదం చేసేలా ఉన్నాయని తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు శాస్త్రి.
ఓరి నాయనో.. ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది.. నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి స్వేచ్ఛనిస్తారని.. అంతే తప్ప మరొకటి కాదు విపరీతార్ధాలు తీయవద్దని మనవి. అంటూ రామజోగయ్య శాస్త్రి రాసుకోచ్చాడు.
ఓరి నాయనో
ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది
నా ఉద్దేశ్యం శివగారు తన టెక్నీషియన్స్ కి
స్వేచ్ఛనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు
విపరీతార్ధాలు తీయవద్దని మనవి 🙏 https://t.co/UPFfDcZxgT— RamajogaiahSastry (@ramjowrites) September 27, 2024