RGV | అగ్ర దర్శకుడు రామ్గోపాల్వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో చర్చల్లో ఉంటారు. తాజాగా ఓ బాలీవుడ్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల పరంగా భాషాపరమైన విభేదాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పఠాన్’ చిత్ర అపూర్వ విజయం బాలీవుడ్లో దక్షిణాది సినిమాల ఆధిపత్యానికి బ్రేక్ వేసిందని రామ్గోపాల్వర్మ అభిప్రాయపడ్డారు.
ఆయన మాట్లాడుతూ ‘కరోనా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ‘కాంతార’ ‘కేజీఎఫ్-2’ వంటి చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో బాలీవుడ్లో ఇకముందు సౌత్ సినిమాల ఆధిపత్యమే ఉండబోతుందని అందరూ భావించారు. అయితే ‘పఠాన్’ చిత్రం ఆ అంచనాలను తలక్రిందులు చేసింది. సినిమాలపరంగా దక్షిణాది, ఉత్తరాది అనే భేదాలను నేను నమ్మను. ఎక్కడైనా సినిమా ఒకటే. రాజమౌళి వంటి దర్శకుడు వేరే రాష్ట్రంలో పుట్టినా అదే రకమైన ప్రతిభతో సినిమాలు తీసేవాడు’ అని చెప్పారు.