Upasana Konidela | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. బాలీవుడ్ కొత్త జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రకు క్షమాపణలు చెప్పారు. కియారా-సిద్ధార్థ్ వివాహం మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లోని జైసల్మేర్లో గల సూర్యగ్రహ్ ప్యాలెస్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను కియారా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన సైతం కియారా-సిద్ధార్థ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ఆర్సీ 15గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ లీడ్రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు.