Rc15 Movie | డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్రాజు. మొదటి సినిమానే తన ఇంటి పేరుగా పెట్టుకుని సక్సెస్కు డెఫినేషన్గా నిలిచాడు. ఈయన జడ్జిమెంట్కు తిరుగులేదని ఇండస్ట్రీలో అంటుంటారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో దిల్రాజుపై ఎన్నడూ లేనంత ట్రోల్ జరిగింది. ఏది మాట్లాడినా వివాదమే అయింది. కొన్ని సార్లు దిల్రాజేనా ఇలా మాట్లాడేది అని కూడా అనిపించింది. ఇక దీనంతటికి కారణం దళపతి విజయ్ నటించిన వారసుడు.
ఈ సినిమాను ముందు నుండి అనువాద చిత్రంగానే తెలుగులో ప్రచారం చేశాడు. కానీ ఆయన గతంలో చెప్పిన స్టేట్మెంట్కు అతీతంగా సంక్రాంతికి అనువాద చిత్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో ఎక్కడ లేని నెగెటీవిటీ స్ప్రెడ్ అయింది. గతంలో సంక్రాంతికి తెలుగు సినిమాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న దిల్రాజు.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దారి ఇవ్వట్లేదు అని విమర్శకులు వెల్లు వెత్తాయి. ఇక అన్ని వివాదాలు చుట్టు ముట్టడంతో చేసేదేమి లేక వారసుడును మూడు రోజులు పోస్ట్ పోన్ చేశాడు. ఇన్నీ జరిగినా సినిమా హిట్టయి దిల్రాజును సంతోష పరిచిందా అంటే అదీ లేదు. తమిళంలో పర్వాలేదనిపించినా.. తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేక బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది.
ఇక ఇదంతా పక్కన పెడితే మరోసారి సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు దిల్రాజు. తన నిర్మాణ సారధ్యంలో రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్సీ15. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ క్రమంలోనే అందరి కంటే ముందే సంక్రాంతిపై కర్చీఫ్ వేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు బాకీ ఉందట. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ శంకర్ మధ్యలో భారీతీయుడు-2 పట్టాలెక్కించడంతో.. షూటింగ్ డేట్స్ అటు ఇటు అడ్జెస్ట్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఔట్ డోర్ షూట్ కూడా కారణమని తెలుస్తుంది.
పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్చరణ్కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఎస్.జే సూర్య, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.