Athammas kitchen | టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్లోకి సురేఖ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. రెడీ మిక్స్ రూపంలో అప్పటికప్పుడు తయారుచేసుకునేలా.. క్వాలిటీ ఫుడ్స్ని అందించే లక్ష్యంతో సురేఖ దీనిని ప్రారంభించారు. ఈ ‘అత్తమ్మాస్ కిచెన్’ సమ్మర్ స్పెషల్లో భాగంగా సురేఖ తాజాగా మామిడికాయ పచ్చడి పెడుతుంది. అయితే సురేఖ మ్యంగో పికిల్ పెడుతుండగా.. ఆమె కోడలు ఉపాసన ఒక్క ఫన్నీ వీడియో తీసి నెట్టింటా విడుదల చేసింది.
చిరంజీవి తల్లి అంజనా దేవి పర్యవేక్షణలో సురేఖ మామిడికాయ పచ్చడి పెడుతుండగా.. ఉపాసన అంజనా దేవి దగ్గరికి వెళ్లి.. నాయనమ్మ మీరు ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయడం లేదా?’’ అని ఉపాసన అడుగుతుంది. పని లేక ఖాళీగా కుర్చున్న అని అంజనా దేవి బదులు ఇస్తుంది. ఆ తర్వాత కెమెరా సురేఖ వైపు తిప్పి అత్తమ్మా అని పిలువగా.. సురేఖ ఏమి చేస్తున్నారు అని నవ్వుతుంది. దీనికి ఊపాసన క్యా హోరా అని అడుగగా.. నాకు హిందీ రాదు అంటూ సురేఖ సమాధానమిస్తుంది ఇక ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇక ‘అత్తమ్మాస్ కిచెన్’లో ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ రెసిపీలన్ని మెగాస్టార్ సతీమణి సురేఖ చేసినవి కావడం విశేషం. కాగా.. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నీ athammaskitchen.com వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు ఉపాసన వెల్లడించింది.