వినయ విధేయ రామ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చెర్రీ.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఇక కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ తెరకెక్కించనున్న క్రేజీ ప్రాజెక్ట్లో కనిపించనున్నాడు.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలుగా పాన్ ఇండియా సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 21న పుణేలో షురూ కానుందనే టాక్ వినిపిస్తోంది. పుణేలో సెట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చింది. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు రామ్చరణ్. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ ఒక్క సినిమాకు చరణ్ 80 కోట్లకి పైగా ఛార్జ్ చేస్తున్నాడట. ఇదే నిజం అయితే ప్రస్తుతానికి ఇది అయితే ప్రభాస్ తర్వాత అత్యధికం అని చెప్పాలి. దిల్ రాజ్ తమ బ్యానర్ లో 50వ సినిమాగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించబోతున్నారు ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ను చిత్రబృందం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.